ప్రజావాణికి డబుల్ ఇండ్ల కోసం వినతుల వెల్లువ

ప్రజావాణికి డబుల్ ఇండ్ల కోసం వినతుల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల కోసమే ఎక్కువ వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన ఇండ్లను త్వరగా అప్పగించాలని, ఇచ్చిన వాటికి రిపేర్లు పూర్తి చేయాలని కోరారు. హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణికి 70 అర్జీలు అందాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, కమిషర్ రోనాల్డ్ రాస్ స్వీకరించారు. అలాగే జోనల్, సర్కిళ్ల ఆఫీసుల్లో 87 ఫిర్యాదులు వచ్చాయి.  మొత్తంగా 157 ఫిర్యాదులు రాగా, ఇందులో సగం డబుల్​ఇండ్లకు సంబంధించినవే ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అర్జీలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత్​రెడ్డి, యాదగిరి రావు, జయరాజ్ కెన్నెడీ, గీతా రాధిక, ఎస్టేట్ డైరెక్టర్ మహమ్మద్ బాషా, సీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.