యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా,  స్పెషల్ దర్శనానికి గంటన్నర  సమయం పడుతోంది.  దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది.  భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు  వెల్లడించారు.