కార్తీక్ సుడిగాలి ఇన్నింగ్స్ ..టీిమిండియా భారీ స్కోరు

కార్తీక్  సుడిగాలి ఇన్నింగ్స్  ..టీిమిండియా భారీ స్కోరు

సిరీస్ లో నిలవాలంటే  గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో  రాణించింది.  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు సాధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరినా..ఇషాన్ కిషన్ 27 పరుగులతో రాణించాడు. అటు కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. దీంతో 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  ఈ స్థితిలో టీమిండియాను హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ ఆదుకున్నారు. పాండ్యా 31 బంతుల్లో 46 పరుగులు చేయగా..దినేష్ కార్తీక్.. సుడిగాలి ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. కేవలం 27 బాల్స్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో  ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టగా..జాన్సన్, ప్రిటోరియస్, నోర్ట్జే, కేశవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలంటే 170 పరుగులు చేయాలి.