ముప్పారం చెరువులో ఎండ వేడికి చేపలు మృతి

ముప్పారం చెరువులో ఎండ వేడికి చేపలు మృతి

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలోని ముప్పారం చెరువులో ఎండ వేడికి చేపలు చనిపోయాయని మత్స్యకారులు తెలిపారు.  వారం రోజులుగా అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడుచెరువులో ఉన్న నీటిని పంట పొలాలకు వదులుతున్నారు. చెరువులో నీటి లభ్యత తగ్గిపోతుండడంతో వేడిని తట్టుకోలేక చేపలు చనిపోయాయి. చనిపోయిన చేపలు ఆదివారం ఉదయం పైకి తేలాయి. సుమారు రూ.6లక్షల నష్టం జరిగినట్లు మత్స్యకారులు తెలిపారు.