V6 News

ప్రజావాణికి దండిగా దరఖాస్తులు

ప్రజావాణికి దండిగా దరఖాస్తులు

జనగామ/ ములుగు/ జయశంకర్​ భూపాలపల్లి/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల  నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆఫీసర్లు తెలిపారు. జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 247 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ములుగులో అడిషనల్​ కలెక్టర్లు మహేందర్​జి, సంపత్​రావు అర్జీలను స్వీకరించగా, మొత్తం 59 దరఖాస్తులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.

అనంతరం వారు జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అధ్యక్షతన బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో పాల్గొని పలు సూచనలు చేశారు. జయశంకర్​ భూపాలపల్లిలో మొత్తం 73 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ పి.అశోక్​ కుమార్​ తెలిపారు. వరంగల్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 153 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​వైవీ గణేశ్​పేర్కొన్నారు.