మేడ్చల్ జిల్లా మేడిపల్లి పి.ఎస్. పరిధిలో బోడుప్పల్ లో విషాదం జరిగింది. సాయిరాం కాలనీలో ఉంటున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కడప జిల్లా చంపడు గ్రామానికి చెందిన అక్షత్(26), చైతన్య(24)గా గుర్తించారు. బ్రతుకు తెరువుకోసం నగరానికి వచ్చారు. వీరికి నెల రోజుల కూతురు ఉంది. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్య కి కారణమని స్థానికులు చెబుతున్నారు.

