సిద్దిపేట రూరల్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఉపాధి కరువై.. భార్య డెలివరీకి కూడా డబ్బులు లేకపోవడంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్ సీఐ పరుశురాంగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందాపూర్ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్డౌన్ఎఫెక్ట్తో ఆటో నడవక, దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు బైక్ను అమ్మేశాడు. దీనికితోడు భార్య డెలివరీ టైం దగ్గరపడడంతో వారం క్రితం ఆమెను టౌన్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జి చేయాల్సి ఉంది. చేతిలో పైసలు లేవనే బాధలో పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.