ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త

ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి.. చున్నితో భార్యను హత్య చేసిన భర్త

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెనుబల్లి మండలం కోత్త లంకపల్లి గుట్ట మీద అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు ఓ భర్త. మధిర మండలం ఏర్రుపాలెం గ్రామానికి చెందిన భార్య భర్తలు ఎర్రమల్ల నవ్య రెడ్డి (22), బుజ్జి నాగశేషు రెడ్డిగా గుర్తించారు పోలీసులు.  రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో నవ్య రెడ్డి భర్త నాగ శేషు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త ఇచ్చిన పిర్యాదు ప్రకారం నవ్య రెడ్డి అదృశ్యం అయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన  దృశ్యాల ఆధారంగా మృతురాలు నవ్య రెడ్డి భర్త నాగ శేషు రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

బుధవారం రాత్రి  నవ్య రెడ్డిని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి  చున్ని తో ఉరి వేసి హత్య వేశాడు.. ఆ తరువాత హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేసాడు నిందితుడు శేషు రెడ్డి.. ఇంజినీరింగ్ లో బ్యాక్ లాక్ లు ఉన్నాయని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలి సెల్ పోన్ నుండి మెసేజ్ లు పంపించాడు నిందితుడు. ఆ తరువాత ఏర్రు పాలెం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.

నిందితుడు నాగ శేషు రెడ్డి పునేలో ఉద్యోగం చేస్తుంటాడు.మృతురాలి కి స్వయానా మేన మామ కొడుకు నాగ శేషు రెడ్డి. రెండు నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది.. మృతురాలు నవ్యారెడ్డి సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతుంది..

see more news

క్రిమినల్​ కేసు పెట్టినా రైతులకే మద్దతిస్త

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్