కరోనా కర్ఫ్యూతో బార్యను కలిసేందుకు ఈ పాస్ రాలేదని మనో వేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు కాంచిపురానికి చెందిన విఘ్నేశ్వరన్ కు చెన్నై తాంబరం కు చెందిన రాగినితో గత ఏడాది జూన్ 20న వివాహం అయ్యింది. ఇద్దరూ కాంచిపూరంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య రాగిని కడుపుతో ఉండడంతో లాక్ డౌన్ ముందు ఆమెను చెన్నై తాంబరంలోని అమ్మగారింటికి పంపాడు విఘ్నేశ్వరన్ . అయితే లాక్ డౌన్ తో భార్యను కలిసేందుకు ఈ పాస్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. కడుపుతో ఉన్న భార్యను కలవలేకపోయానన్న బాధతో కుమిలిపోయాడు. అంతే కాకుండా ఇటీవల జూన్ 20 న తమ మొదటి పెళ్ళి రోజు అయినా కనీసం భార్యతో కలిసి జరుపుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ పాస్ లభించలేదు. తరచూ భార్య చూడాలనిపిస్తోందంటూ విఘ్నేశ్వరన్ కు ఫోన్ చేసేది. దీంతో మరింత కుమిలిపోయాడు విఘ్నేశ్వరన్. మనస్థాపంతో కాంచిపురంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రాత్రి భార్య రాగినికి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. విషయం విగ్నేశ్వరన్ కు చెప్పేందుకు ఆమె తల్లింద్రులు ఎంతో ప్రయత్నించారు. ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో విఘ్వేశర్వరన్ స్నేహితులకు సమాచారం అందించారు. రాగినిని ఆస్పత్రిలో చేర్పించారన్న విషయాన్ని విఘ్వేశ్వరన్ కు చెప్పేందుకు అతని స్నేహితులు ఇంటికి వెళ్లారు. అయితే అతని స్నేహితులు విఘ్వేశ్వర్ ను ఇంటి డోర్ ఎంత సేపు కొట్టినా ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి డోర్లు బలవంతంగా ఓపెన్ చేయగా బాధితుడు విఘ్వేశ్వరన్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఒకవైపు పురిటి నొప్పులతో భార్య ఆసుపత్రిలో చేరగా, మరో వైపు భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విఘ్వేశ్వరన్ మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
కరోనా కర్ఫ్యూ: భార్యను కలిసేందుకు దొరకని ఈ – పాస్.. ఆత్మహత్య చేసుకున్నభర్త
- క్రైమ్
- June 30, 2020
లేటెస్ట్
- Sinil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్టర్తో మలయాళ ఎంట్రీ..
- కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు
- Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
- రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై