ఇవాళ హైదరాబాద్‌ చేరుకోనున్న ముకరం ఝా భౌతికకాయం

ఇవాళ హైదరాబాద్‌ చేరుకోనున్న ముకరం ఝా భౌతికకాయం

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరం ఝా అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు కుటుంబసభ్యులు హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జనవరి 14న మరణించిన ఆయన భౌతికకాయం ఇవాళ చార్టర్డ్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకోనుంది.  నగరానికి చేరుకున్నాక ఆయన భౌతిక కాయాన్ని చౌమహల్లా ప్యాలెస్ కు తీసుకెళ్లనున్నారు. ఆయన కడసారి చూపు కోసం బంధు మిత్రులతో పాటు సాధారణ జనం భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చౌమహల్లా ప్యాలెస్ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద ముకరం ఝాను ఖననం చేయనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్‌ 6న ముకరం ఝా జన్మించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొడుకులను కాదని తన వారసుడిగా ముకర్రం ఝాను 1967 ఏప్రిల్  6న చౌమహల్లా ప్యాలెస్ లో ముకరం ఝా హైదరాబాద్ ఎనిమిదో నిజాంగా పట్టాభిషిక్తులైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి కొన్నాళ్లు గడిపిన ముకరం ఝా ఆ తర్వాత టర్కీలో స్థిరపడ్డారు.