పారా అథ్లెటిక్లో లోకేశ్, దేవేంద్రకు పతకాలు

పారా అథ్లెటిక్లో  లోకేశ్, దేవేంద్రకు పతకాలు

హైదరాబాద్, వెలుగు: నేషనల్ జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో  హైదరాబాద్ అథ్లెట్లు లోకేశ్‌‌‌‌‌‌‌‌, దేవేంద్ర సత్తా చాటారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన టోర్నీలో లోకేష్ ఎఫ్/46  విభాగం జావెలిన్ త్రో లో సిల్వర్ మెడల్, షాట్‌‌‌‌‌‌‌‌పుట్, డిస్కస్ త్రోలో  గోల్డ్ మెడల్స్ సాధించాడు.  

దేవేంద్ర ఎఫ్-47 విభాగం  డిస్కస్‌‌‌‌‌‌‌‌త్రోలో గోల్డ్,  షాట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్ నెగ్గాడు.ఈ ఇద్దరితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ ఆదిత్య మెహతా ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ పొందిన 16మంది ఈ టోర్నీలో పతకాలు సాధించారు.