
- హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అప్రెంటిస్ జాబ్స్కు టాప్ లొకేషన్స్
- వీటిలో హైదరాబాద్కు మొదటిస్థానం
- మిగతా స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు
ముంబై : ఐటీ/టెక్ ఇండస్ట్రీ హబ్స్గా ఎదిగిన హైదరాబాద్, ఢిల్లీ బెంగళూరు కిందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో (జనవరి–-మార్చి 2023) అప్రెంటిస్ నియామకంలో టాప్ లొకేషన్స్గా నిలిచాయి. 78 శాతం నెట్ అప్రెంటిస్షిప్ అవుట్లుక్ (ఎన్ఏఓ)తో హైదరాబాద్లో మొదటిస్థానంలో ఉంది. ఢిల్లీ (74 శాతం ఎన్ఏఓ) బెంగళూరు (68 శాతం ఎన్ఏఓ) మిగతా స్థానాల్లో నిలిచాయి. మునుపటి ఆర్నెళ్ల (2022 జూలై-–డిసెంబర్)తో పోలిస్తే అప్రెంటిస్షిప్ బాగా పెరిగిందని టీమ్లీజ్ అప్రెంటిస్షిప్ అవుట్లుక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ తయారీకి 14 నగరాలకు చెందిన 24 పరిశ్రమలు, 597 మంది ఎంప్లాయర్స్ నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వే ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు జరిగింది.
అంతేకాకుండా, హైదరాబాద్లో 83 శాతం మంది ఎంప్లాయర్స్, ఢిల్లీలో 82 శాతం, బెంగళూరులో 80 శాతం మంది అప్రెంటిస్లను పెంచే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది. చెన్నై (81 శాతం), ముంబై (77 శాతం) సత్తాను ప్రదర్శిస్తున్నాయి. అప్రెంటిస్ల సంఖ్యను పెంచుకోవడానికి సిద్ధమని 2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో 77 శాతం మంది యజమానులు చెప్పగా, 2023 జనవరి–-మార్చిలో 79 శాతం మంది ప్రకటించారు. రిక్రూట్మెంట్ పరంగా చూస్తే మెట్రో నగరాలు ముందంజలో ఉండగా, కోయంబత్తూర్ (79 శాతం ఎన్ఏఓ), నాగ్పూర్ పూణే (ఒక్కొక్కటి 76 శాతం ఎన్ఏఓ) అహ్మదాబాద్ (70 శాతం ఎన్ఏఓ) సహా నాన్–-మెట్రో నగరాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. స్కిల్డ్ మ్యాన్ పవర్ను లోటును అధిగమించేందుకు డిప్లాయ్మెంట్ను పెంచినట్టు కోయంబత్తూర్లో 84 శాతం, పూణేలో 85 శాతం, నాగ్పూర్లో 86 శాతం, అహ్మదాబాద్లో 83 శాతం మంది ఎంప్లాయర్లు చెప్పారు.
ఇంజనీరింగ్లో ఎక్కువ...
ఇంజినీరింగ్ పారిశ్రామిక వంటి కీలకమైన పరిశ్రమలలో అప్రెంటిస్షిప్ బాగా పెరిగింది. అత్యధిక ఎన్ఏఓ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్లో (90 శాతం) ఉండగా, మిగతా స్థానాల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ (88 శాతం), బ్యాంకింగ్, ఆర్థిక సేవలు బీమా (74 శాతం) ఉన్నాయి. ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్లో 94 శాతం మంది ఎంప్లాయర్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో 93 శాతం బీఎఫ్ఎస్ఐలో 85 శాతం మంది తమ అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. " హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూలో వృద్ధి కనిపిస్తోంది. భారతదేశంలో అప్రెంటిస్షిప్ నియామకాలు ఈ ఏడాది మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నగరాలు, ఐటీ/టెక్ పరిశ్రమకు కేంద్రాలుగా ఎదగడం వల్ల అప్రెంటిస్లకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఇండస్ట్రీకి మరింత స్కిల్పవర్ దొరుకుతుంది " అని టీమ్లీజ్ ఎగ్జిక్యూటివ్ సుమిత్ కుమార్ తెలిపారు. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, స్కిల్ డెవెలప్మెంట్ద్వారా అన్ని ప్రాంతాలకూ మేలు జరుగుతుందని అన్నారు.అప్రెంటిస్తో నిరుద్యోగులకు, ఎంప్లాయర్స్కు ప్రయోజనమని వివరించారు.