గణేశ్ ఉత్సవాల్లో డీజేకు నో పర్మిషన్..

గణేశ్ ఉత్సవాల్లో డీజేకు నో పర్మిషన్..

మేడిపల్లి/మేడ్చల్, వెలుగు: గణేశ్​ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి, మేడ్చల్​ ఏసీపీలు చక్రపాణి, శంకర్​రెడ్డి హెచ్చరించారు. ఆదివారం పీర్జాదిగూడ, మేడ్చల్​ మున్సిపల్​ కార్యాలయాల్లో వారు వేర్వేరుగా గణేశ్​ ఉత్సవ  ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతి పొందాలన్నారు. గొడవలు జరగని చోట ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. తొమ్మిది రోజుల్లోనే నిమజ్జనం చేయాలన్నారు.