హైదరాబాద్, వెలుగు: భాగ్యనగరంలో ఐపీఎల్ ఫీవర్ షురూ అయింది. మెగా లీగ్ 16వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తొలి పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో గత సీజన్ రన్నరప్ రాజస్తాన్ రాయల్స్తో సన్రైజర్స్ 16వ సీజన్ను ఆరంభించనుంది.
గతేడాది ఎనిమిదో స్థానంతో సరిపెట్టిన రైజర్స్ ఈసారి సరికొత్త రూపుతో బరిలోకి దిగుతోంది. డజను మంది ఆటగాళ్లను మార్చిన హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్లో స్ట్రాంగ్గా మారింది. సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు కెప్టెన్సీ అప్పగించింది. అయితే, ఫస్ట్ మ్యాచ్కు మార్క్రమ్ అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.