
- దేశంలో హైదరాబాద్కు మూడో స్థానం
- అప్పులిచ్చుడులో కూడా థర్డ్ ప్లేసే
- లెండింగ్ ప్లాట్ఫామ్ లెన్డెన్ క్లబ్ స్టడీ
- అప్పు చేసేటోళ్లలో 40% చిరుద్యోగులే
- ఎమర్జెన్సీ అవసరాలకే ఎక్కువ బాకీలు
మొబైల్ యాప్లతోని బాకీలు తీస్కునుడు హైదరాబాద్లో ఎక్కువైంది. పర్సన్ టు పర్సన్ (పీ టు పీ)గా పిలిచే ఈ అప్పుల వ్యవహారం ఈ మధ్యన సిటీలో బాగా పెరిగింది. తీస్కునుడే కాదు అప్పులిచ్చుడులో కూడా మన సిటీ ముందే ఉన్నది. అప్పులిచ్చుడు, తీస్కునుడు రెండింటిలో దేశంలోని సిటీలల్లో మూడో ప్లేస్లో నిలిచింది. పీ టు పీ రుణాలపై ‘లెన్డెన్ క్లబ్’ అనే లెండింగ్ ప్లాట్ఫామ్ దేశవ్యాప్తంగా చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. జనవరి 2019 నుంచి జనవరి 2020 వరకు 4 లక్షల మంది యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రిపోర్టును రెడీ చేసి గురువారం సంస్థ విడుదల చేసింది.
మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యనే మస్తుగ..
బాకీలు చేసేటోళ్లలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయని.. అప్పులు ఇచ్చేటోళ్లలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఫస్ట్ మూడు ప్లేస్లలో ఉన్నాయని స్టడీ పేర్కొంది. అప్పులు ఎక్కువగా ఎమర్జెన్సీ అవసరాలకే చేస్తున్నారని స్టడీ చెప్పింది. రూ. 12 వేల నుంచి రూ. 20 వేల జీతం వచ్చేటోళ్లే బాకీలెక్కువ చేస్తున్నారంది. మంగళ, బుధ, గురువారాల్లో ఎక్కువగా లోన్ కోసం అప్లై చేస్తున్నారని, అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్యేనని తెలిపింది.
రూ.12 వేల నుంచి రూ.20 వేల జీతపోళ్లే..
అప్పులు చేస్తున్న వారిలో రూ.12 వేల నుంచి రూ. 20 వేల జీతం ఉన్నోళ్లు 40 శాతం మంది, రూ.20 వేల నుంచి రూ.30 వేల జీతం వచ్చే వాళ్లు 31 శాతం మంది ఉన్నారని స్టడీలో తేలింది. రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వచ్చే వాళ్లు 14 శాతం, రూ.40 వేలపైగా జీతం ఉన్నోళ్లు 15 శాతం మంది ఉన్నారని వెల్లడైంది. అప్పులు తీస్కుంటున్న వాళ్లలో మగ వాళ్లు 84 శాతం, ఆడవాళ్లు 16 శాతం మంది ఉన్నారని తెలిసింది. బాకీ తీసుకుంటున్న వాళ్లలో 53 శాతం పెండ్లయిన వాళ్లు.. 47 శాతం సింగిల్స్ ఉన్నారని వెల్లడైంది. 20 నుంచి 30 ఏండ్ల వాళ్లే ఎక్కువగా (41 శాతం) అప్పు తీసుకుంటున్నారని స్టడీ వెల్లడించింది. సగటున 37 శాతం మంది రిపీటెడ్గా అప్పులు తీసుకుంటుండగా 63 శాతం మంది కొత్తవాళ్లు ఉంటున్నారని వెల్లడించింది.
రీ పేమెంట్లో పుణే ఫస్ట్
మెడికల్ఎమర్జెన్సీ, కిరాయిలు, ఫ్యామిలీ ఫంక్షన్ల కోసమే ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు స్టడీలో తేలింది. వీటితో పాటు ఎడ్యుకేషన్, ఫ్యామిలీ అవసరాలు, ఇంటి రిపేర్ల కోసమూ అప్పులు తీసుకుంటున్నట్ల వెల్లడైంది. రీ పేమెంట్ చేయడంలో పుణే, ముంబై, హైదరాబాద్ తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు స్టడీ చెప్పింది. 50 శాతం మంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్ధతిలో రీ పేమెంట్ చేస్తుండగా 47 శాతం మంది ఈసీఎస్ పద్ధతిలో, మూడు శాతం మంది నెఫ్ట్ పద్ధతిలో బాకీలు కడుతున్నారని పేర్కొంది.
లక్ష వరకు ఇన్వెస్ట్ ఎక్కువ
అప్పులిస్తున్న వారిలో ఎక్కువ మంది రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారని స్టడీ వెల్లడించింది. పీ టు పీ లెండింగ్లో వ్యాపారస్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, మొత్తంగా వీళ్లే 53 శాతం మంది ఉన్నారని చెప్పింది. ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్లలో 88 శాతం మంది మగ, 12 శాతం మంది ఆడవాళ్లున్నారని పేర్కొంది. ఎక్కువగా 30 ఏండ్ల లోపు వాళ్లే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారని
చెప్పింది.
అంతా మొబైల్తోనే..
పీ టు పీ (పర్సన్ టు పర్సన్) లెండింగ్గా చెప్పే ఈ ప్రక్రియలో లోన్ మంజూరు, రీ పేమెంట్ అంతా మొబైల్ యాప్లతోనే పూర్తవుతుంది. అప్పు తీసుకునే, ఇచ్చే వ్యక్తుల మధ్య లెండ్ బాక్స్, ఫెయిర్సెంట్, లెండింగ్ కార్ట్, ఫిన్జీ, ఐ2ఐ ఫండింగ్, ఐ లెండ్, లెన్డెన్ క్లబ్, పైసా దుకాణ్ లాంటి అనేక లెండింగ్ ప్లాట్ఫామ్స్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాయి. ఈ లెండింగ్ ప్లాట్ఫామ్లో కూడా బ్యాంకుల్లానే సిబిల్ స్కోరు ఆధారంగా లోన్
దొరుకుతుంది.