రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో గెలుపు ముంగిట హైదరాబాద్

రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో గెలుపు ముంగిట హైదరాబాద్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మేఘాలయతో రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో హైదరాబాద్ గెలుపు ముంగిట నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేఘాలయ ఇచ్చిన 198 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో రోజు, సోమవారం చివరకు హైదరాబాద్ 71/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (0) డకౌటైనా రాహుల్ సింగ్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 బ్యాటింగ్), తనయ్ త్యాగరాజన్ (17 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాణించారు.

చేతిలో మరో తొమ్మిది వికెట్లున్న హైదరాబాద్ విజయానికి  127 రన్స్ అవసరం. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 0/1తో మూడో రోజు ఆట కొనసాగించిన మేఘాలయ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 243 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రాజ్ బిస్వా (100) సెంచరీ, జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీరత్ సింగ్  (81) ఫిఫ్టీతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టగా, రోహిత్ రాయుడు రెండు వికెట్లు తీశాడు.