
- సిటీ జనాలకు నాణ్యతతో నీటి సరఫరా
- ప్రతి రోజు 15వేల షాంపిల్స్ సేకరణ
- బోర్డు నీరు సురక్షితంఅంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు : వాటర్బోర్డు ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ను మరోసారి పొడిగించారు. గ్రేటర్సిటీ వాసులకు తాగునీటిని అందించే బోర్డుకు మొదటిసారి 2017లో ఐఎస్ఓ దక్కింది. 2020లో గడువు ముగిసింది. మళ్లీ 2023లో మరోసారి పొడిగించారు. తాజాగా మూడోసారి 2026 వరకు పొడిగింపు లభించినట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. తాగునీటి పంపిణీలో పాటించే నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడకుండా సప్లై చేస్తున్నట్టు పేర్కొన్నారు. కలుషిత కేసులు లేకుండా సురక్షితమైన వాటర్ అందిస్తున్నట్టు చెప్పారు. నదుల నుంచి నీటిని తరలించి నిల్వ చేయడం, శుద్ధి, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ తదితర దశల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండగా.. వాటర్బోర్డుకు ఐఎస్ ఓ వచ్చినట్టు వివరించారు.
రోజుకు 592 మిలియన్ గ్యాలన్లు పంపిణీ
మెట్రోవాటర్బోర్డు పరిధిలో 10.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా.. రోజుకు 592 మిలియన్గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. కృష్ణ ప్రాజెక్టు మూడు దశలు, గోదావరి మొదటి దశ, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, సింగూరు, మంజీరా ద్వారా నీటిని తరలిస్తుంది. దాదాపు 225 పైగా సర్వీస్ రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికీ నీటి పంపిణీ చేస్తుంది.
తేడాలుంటే అధికారులు అలర్ట్
గ్రేటర్సిటీలో దాదాపు కోటి మంది జనాభాకు తాగునీటిని అందించే వాటర్బోర్డు తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. సిటీలో 250 క్లోరినేషన్పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నీటి శుద్ధికి దాదాపు 200 లిక్విడ్ క్లోరిన్ సిలిండర్లను వినియోగిస్తుంది. రూల్స్ ప్రకారం ఒక్కో మిలియన్ లీటర్ల శుద్ధికి కిలో క్లోరినేషన్ వాడుతుంది. సరఫరా చేసే నీరు సురక్షితమని, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవని బోర్డు అధికారులు తెలిపారు. అన్ని డివిజన్లలో నీటి నాణ్యత పరిశీలనకు రోజూ 3 మొబైల్టెస్టింగ్ల్యాబ్లను పంపుతున్నట్లు పేర్కొన్నారు. నీటి నాణ్యతలో తేడాలుంటే అధికారులను అలర్ట్ చేసి..ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు.