హైదరాబాద్ లో 2 రూపాయలకే బిర్యాని..

హైదరాబాద్ లో 2 రూపాయలకే బిర్యాని..

హైదరాబాది బిర్యాని లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పుడు కేవలం రూ.2లకే హైదరాబాది బిర్యాని తినొచ్చు. అదేంటి.. రూ.2లకే బిర్యాని ఎలా వస్తుంది.. అందులోనూ హైదరాబాది బిర్యాని అని అనుంకుంటున్నారా?.. కానీ మీరూ చదివింది నిజమే. హైదరాబాద్ లోని ఓ పాపులర్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ను ప్రకటించింది. నాయుడు గారి కుండ బిర్యానీలో 2 రూపాయలకే మీరు అద్భుతమైన బిర్యానిని  ఆస్వాదించవచ్చు. కానీ.. ఈ బిర్యానిని తినాలంటే.. వారు విసిరిన ఛాలెంజ్ లో మీరు నెగ్గాల్సిందే. ఇంతకీ ఛాలెంజ్ ఎంటంటే.. ఎవరైతే, 2 రూపాయల నోట్ ను పే చేస్తరో... వారికి మాత్రమే ఈ బిర్యానిని తీనే అవకాశం ఉంటుందని నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించింది. ఈ రెస్టారెంట్ కండీషన్స్ ప్రాకారం.. 2 రూపాయల నోట్ పే చేసిన ఒక్కరికి ఒక బిర్యాని మాత్రమే లభిస్తుంది.  వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీని కూడా ఎంచుకోవచ్చని తెలిపింది.

ఇప్పటికీ ప్రజలు రూ.2 నోట్లను కలిగి ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఆఫర్‌ను ప్రారంభించినట్లు నాయుడు గారి కుంట బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది. ఈ ఆఫర్ కు బిర్యాని ప్రేమికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని.. ఇప్పటివరకు 100మంది ఈ ఆఫర్ ని వినియోగించుకుని బిర్యానిని ఆస్వాదించారని చెప్పింది. హైదరాబాద్ లో నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ కు సంబంధించిన  మూడు బ్రాంచ్ లు ఉన్నాయి. కూకట్ పల్లి కెపిహెచ్ బి, గచ్చిబౌలి, దిల్ సుఖ్ నగర్ లో ఈ హోటల్ బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే, కూకట్ పల్లి కెపిహెచ్ బిలో ఉన్న బ్రాంచ్ హోటల్ లో మాత్రమే ఈ ఆఫర్ ను తీసుకొచ్చారు యాజమాన్యం. 

నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్ తరచుగా కస్టమర్‌లను ఆకర్షించడానికి ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్‌లను ప్రారంభిస్తుంది. ఇంతకుముందు కూడా ఈ రెస్టారెంట్.. ఫుడ్ లవర్స్ కు కేవలం 30 నిమిషాల్లో  బాహుబలి థాలీని కంప్లీట్ చేసే ఓపెన్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది.  30కి పైగా వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ తో ఉండే ఈ బాహులబలి థాలీని 30 నిమిషాల్లో తింటే.. బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు.ఈ ఆఫర్ ఇప్పటకీ కొనసాగుతోంది.  రూ. 1, 999కు లభించే ఈ బాహుబలి థాలీ ఛాలెంజ్‌లో కేవలం ఏడుగురు మాత్రమే విజయవంతమయ్యారు.