జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలో సర్వేనెంబర్ 483లో ఉన్న చంద్రన్న కుంట చెరువును కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు కాపాడారు. కొంతకాలంగా కుంటకు సంబంధించిన 1.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి వాడుకుంటున్నారు.
దీంతో నిజాంపేట్జేఏసీ నాయకుడు ఆకుల సతీశ్ ఆధ్వర్యంలో చెరువు వద్ద ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. దీనిపై వీ6 చానెల్ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేసింది. స్పందించిన హైడ్రా అధికారులు ఆదివారం చెరువు చుట్టూ కంచెను నిర్మించారు.
