మే 20, 21 తేదీల్లో ఐసెట్

మే 20, 21 తేదీల్లో ఐసెట్

మార్చి 6న నోటిఫికేషన్    ఈసారి దివ్యాంగులకూ ఫీజు రాయితీ

హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. టీఎస్​ఐసెట్-2020 కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సందర్భంగా నోటిఫికేషన్, పరీక్ష ఫీజు తదితర అంశాలపై చర్చించారు. ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి సెట్ షెడ్యూల్​ను ప్రతిపాదించిగా కమిటీ ఆమోదం తెలిపింది. తొలిసారి ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్వాంగులకూ ఫీజులో రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ స్టూడెంట్స్ కు రూ.450, ఇతర విద్యార్థులకు రూ.650 ఎగ్జామ్​ఫీజు ఉంటుంది.

టీఎస్ ఆన్​లైన్, ఈసేవా సెంటర్స్ తో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 14 రీజియన్ సెంటర్లలో ఐసెట్ ఎగ్జామ్ నిర్వహించనుండగా… వీటిలో ఏపీకి చెందిన కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. మే 20,21 తేదీల్లో మూడు సెషన్స్ లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. మే 20న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు, మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, 21న ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం12:30గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. జూన్ 12న ఫలితాలను విడుదల చేస్తారు. ఐసెట్ ద్వారా 9 యూనివర్సిటీల పరిధిలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. డిస్టెన్స్ లో చదివిన స్టూడెంట్లు ఐసెట్ రాసేందుకు ఎలిజిబుల్ కాదని అధికారులు తెలిపారు.

ఇదీ షెడ్యూల్
మార్చి 6న నోటిఫికేషన్ విడుదల
9 నుంచి ఏప్రిల్ 30 ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్
రూ.500 లేట్ ఫీజుతో
మే 6 వరకు అవకాశం
రూ.2 వేల లేట్ ఫీజుతో 11 వరకు,
రూ.5 వేల లేట్ ఫీజుతో 16 వరకు చాన్స్
మే 14 నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్
మే 20, 21 తేదీల్లో ఐసెట్ పరీక్ష
27న ప్రిలిమినరీ కీ రిలీజ్
జూన్ 12న రిజల్ట్స్