గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్

గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్

సత్తుపల్లి, వెలుగు: గంజాయి కేసులో ఇద్దరు మైనర్లతో పాటు ఓ యువకుడిని అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపినట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. పట్టణంలోని మార్కెట్  గోదామ్​ వద్ద రేజర్ల గ్రామానికి చెందిన సింహాద్రి సందీప్  గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై అశోక్​కుమార్​ పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి కొంటున్న వారిలో ఇద్దరు పారిపోగా, ఇద్దరు మైనర్లతో పాటు సందీప్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 632 గ్రాముల గంజాయి, బైక్​ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆదివారం నిందితులను రిమాండ్ కు పంపించామని తెలిపారు.