
న్యూడిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పొదుపు ఖాతాల్లో మినిమమ్బ్యాలెన్స్ మొత్తాన్ని (ఎంబీఏ) 5 రెట్లు పెంచి రూ.50 వేలకు చేర్చింది. గతంలో ఇది రూ.10 వేలు ఉండేది. ఈ నెల ఒకటో తేదీ తర్వాత తెరిచిన కొత్త పొదుపు బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాలి. సెమీ-అర్బన్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు ఎంఏబీ వరుసగా రూ.25 వేలకు, రూ.10 వేలకు పెంచింది. ఎంఏబీ చెల్లించకపోతే, ఎంఏబీ లోటులో 6 శాతం లేదా రూ. 500..ఏది తక్కువైతే అది కట్టాలి.
సేవింగ్స్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్పై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ నెల ఒకటో తేదీకి ముందు ఖాతాలు తెరిచిన కస్టమర్లు ప్రస్తుతానికి పాత ఎంఏబీ స్థాయిని కొనసాగించాలి. జీతం ఖాతాదారులు, పీఎం జనధన్ ఖాతాదారులు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు రూ.50 వేల లిమిట్వర్తించదు. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఎంబీఏపై జరిమానాలను తొలగించాయి.