ముంబై: ఈ ఏడాది ఆగస్టు నెలలో డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 23 శాతం పెరిగి 1.24 కోట్లకు చేరినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ ఇక్రా ఒక రిపోర్టులో వెల్లడించింది. కొవిడ్ ముందుతో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువని పేర్కొంది. సెక్వెన్షియల్గా చూస్తే జులై నెలలో ఈ గ్రోత్ 3.2 శాతమేనని, ఆ నెలలో 1.21 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారని ఇక్రా రిపోర్టు తెలిపింది. ఆగస్టు నెలలో కెపాసిటీ డిప్లాయ్మెంట్ కూడా 10 శాతం అధికమైనట్లు వివరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ నిలకడగా ఉంటుందని తన అవుట్లుక్ను ప్రకటించింది. దేశంలోని చాలా రూట్లలో డొమెస్టిక్ పాసింజర్ ట్రాఫిక్ వేగంగా రికవరయినట్లు తెలిపింది. ఇదే ట్రెండ్ రాబోయే నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్లైన్స్ కంపెనీల ఆదాయాలు కూడా మెరుగయ్యాయని ఇక్రా రిపోర్టు వెల్లడించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తక్కువగా ఉండటం ఈ ఇండస్ట్రీకి కలిసి వస్తోందని వివరించింది.
ఏటీఎఫ్ నెలవారీ పెరుగుదల కొంత ఎక్కువగానే ఉంటోందని, దీని ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడుతుందని పేర్కొంది. ఏటీఎఫ్ రేట్ల పెరుగుదల తట్టుకోవడం ఒక సవాలేనని అభిప్రాయపడింది. ఏవియేషన్ఇండస్ట్రీ రెవెన్యూ నిలకడ సాధించేందుకు మరికొంత టైము పడుతుందని పేర్కొంది. 2022–23 లో ఏవియేషన్ ఇండస్ట్రీ రూ. 17 వేల కోట్ల దాకా నష్టాలపాలైనట్లు ఇక్రా అంచనా వేసింది. అయితే, అంతకు ముందు ఏడాదిలోని రూ. 22 వేల కోట్లతో పోలిస్తే అది తక్కువేనని వివరించింది. పాసింజర్ల గ్రోత్ మెరుగవడంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిర్లైన్స్ నష్టాలు రూ. 5 వేల కోట్లకు మించకపోవచ్చని వెల్లడించింది.