నిధులు సరిపోవట్లేదా.. రియల్ ఎస్టేట్ చేస్కోండి

నిధులు సరిపోవట్లేదా.. రియల్ ఎస్టేట్ చేస్కోండి
  • మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సర్కారు సూచన
  • మరిన్ని యూడీఏల ఏర్పాటుకు ప్రపోజల్స్​
  • ఉంటే ప్రభుత్వ భూముల్లో వెంచర్లు.. లేదంటే ప్రైవేట్ భూములు సేకరించి బిజినెస్​
  • అట్లా వచ్చే పైసలతోటి సిటీల్లో డెవలప్​మెంట్​ పనులు 
  • సర్కారు ల్యాండ్స్​ అమ్ముకుంటూ పోతే భవిష్యత్​ అవసరాలకు కష్టమేనంటున్న ఆఫీసర్లు

నెట్​వర్క్​, వెలుగు: పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ ఏమూలకూ సరిపోక దిక్కులుచూస్తున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇకపై సొంత ఆదాయమార్గాలు వెతుక్కోవాలని రాష్ట్ర సర్కారు తేల్చి చెప్తున్నది. సిటీలు, టౌన్ల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను వెంచర్లు చేసి అమ్మడం ద్వారా వచ్చిన ఇన్​కంతో డెవలప్​ చేసుకోవాలని సూచిస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీ (యూడీఏ)లుగా మారుస్తున్నది. యూడీఏల పరిధిలో ఇప్పటికే చేపట్టిన రియల్ ఎస్టేట్​బిజినెస్​ను మిగిలిన పట్టణాలకూ విస్తరించాలని నిర్ణయించింది. అయితే.. వరంగల్​లోని ‘కుడా’లో తప్ప మిగిలిన చోట్ల ఈ ‘రియల్​ఎస్టేట్​ ఫార్ములా’ పెద్దగా సక్సెస్​ కాలేదు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తేలడంతో తాజాగా ప్రభుత్వం రూట్​మార్చింది. సర్కారు జాగలు లేని చోట ల్యాండ్​ పూలింగ్​ కింద ప్రైవేట్ భూములను సేకరించి వెంచర్లు చేయాలని, వీలైతే  టౌన్​షిప్​లు కట్టి అమ్మాలని ఇటీవల నల్గొండలో మంత్రి కేటీఆర్​ఆదేశించారు. దీంతో ఆఫీసర్లంతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అసలు పనులు పక్కనపెట్టి భూములు సేకరించే పనిలో పడ్డారు.
అంటే సగటున ఒక్కో అర్బన్​లోకల్​బాడీ( యూఎల్​బీ)కి రూ. కోటి కూడా రావడం లేదు.  ప్రాపర్టీ టాక్సెస్​ కూడా ఆశించిన స్థాయిలో వసూలు కావట్లేదు. దీంతో సరిపడా ఫండ్స్​ లేక నగరాలు, పట్టణాల్లో మౌలికవసతుల సమస్య వేధిస్తున్నది. ఏండ్లు గడుస్తున్నా అండర్​గ్రౌండ్​ డ్రైనేజీలు, ఇంటర్నల్​ రోడ్లు, నాలాల విస్తరణ పూర్తికాక పబ్లిక్​ ఇబ్బందులు పడుతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ తవ్వకాలతో దెబ్బతిన్న రోడ్లను కూడా రిపేర్​ చేయించలేని పరిస్థితి ఉంది. ఇక శివారు కాలనీలు, విలీన పంచాయతీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షం వస్తే కాలనీలు నీటమునుగుతున్నాయి. కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, ఇతర మున్సిపాలిటీల్లో బ్యూటిఫికేషన్​వర్క్స్​కింద మొదలుపెట్టిన డివైడర్లు, సర్కిళ్ల డెవలప్​మెంట్​, పార్కులు, ట్యాంక్​బండ్స్ లాంటి పనులు ఏండ్లు గడుస్తున్నా కంప్లీట్​ అయితలేవు. 
ప్రైవేట్​ భూమిని సేకరించి వెంచర్లు!
వరంగల్​లో సక్సెస్​అయిన ‘రియల్​ ఎస్టేట్’ ఫార్ములా మిగిలిన యూడీఏలలో పెద్దగా సక్సెస్​ కాలేదు.  సర్కారు భూములు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో సర్కారు జాగలు లేని చోట ల్యాండ్​పూలింగ్​ కింద ప్రైవేట్​ భూములైనా సేకరించి, వెంచర్లు, అవసరమైతే టౌన్​షిప్​లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, టౌన్​ప్లానింగ్ ఆఫీసర్లు ల్యాండ్​సెర్చింగ్​లో పడ్డారు. ఒకేచోట కనీసం 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే సొంతంగా​వెంచర్​ఏర్పాటు కోసం పైకి  ప్రపోజల్స్​ పంపుతున్నారు. అంతకంటే తక్కువ ఉన్నచోట పక్కనే ఉన్న ప్రైవేట్​ల్యాండ్స్​ సేకరించేందుకు యజమానులతో మాట్లాడుతున్నారు. సిద్దిపేట అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్​అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో టౌన్ షిప్ ల ఏర్పాటుకు అక్కడి ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 100 ఎకరాలు, కొండపాక మండలం లకుడారంలో 100 ఎకరాల భూమిని గుర్తించి ఆయా స్థలాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. ఈ ఫైళ్లు సర్కారు దగ్గర పెండింగ్​లో ఉన్నాయి.  ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగానే టౌన్​షిప్​ పనులు ప్రారంభించేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఇదే విషయమై మున్సిపల్​ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. నుడా కింద నల్గొండ చుట్టూ 50 కిలోమీటర్ల దూరందాకా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో టౌన్​షిప్​లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లోనూ ప్రభుత్వ స్థలాలను గుర్తించి  ప్రపోజల్స్ రెడీ చేయాలన్నారు. డీటీసీపీ అనుమతితో లేఅవుట్లు చేసి ప్రజలకు విక్రయించాలన్నారు. అలా వచ్చిన ఇన్​కంతో మున్సిపాలిటీ లను అన్నిరకాలుగా డెవలప్ ​చేసుకోవాలని సూచించారు. కాగా, నల్గొండ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు లేకపోవడంతో ల్యాండ్​పూలింగ్​ కింద ప్రైవేట్​ భూములు సేకరించేందుకు అక్కడి ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. మొత్తంమీద ప్రభుత్వ భూములను అమ్మయినా పట్టణాలను డెవలప్ ​​చేసుకోవాలని చెప్పడమంటే సర్కారుకు ఇక ముందు కూడా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఫండ్స్​ పెంచే ఆలోచన లేనట్లేనని కమిషనర్లు చెప్తున్నారు. ఈలెక్కన రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యూడీఏలు ఏర్పాటుచేసే అవకాశముందంటున్నారు. ఇలా జాగలన్నింటినీ అమ్మేస్తే  భవిష్యత్​లో సర్కారు అవసరాలకు ఇబ్బందులు తప్పవని ఆఫీసర్లు, ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.
పట్టణ ప్రగతి ఫండ్స్​ అంతంతే..
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద సర్కారు ఇస్తున్న ఫండ్స్​ ఏమూలకూ చాలడం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్​ కమిషన్​, రాష్ట్రం ఇచ్చే స్టేట్​ఫైనాన్స్​కమిషన్​ ఫండ్స్​ను కలిపి పట్టణ ప్రగతి కింద 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రతి నెలా  రూ.145 కోట్ల ఇస్తున్నారు. 
తెరపైకి మరిన్ని యూడీఏలు
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాల్లో మాస్టర్​ ప్లాన్​ అమలుచేసి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు 1975 నుంచే  అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (యూడీఏ)లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదట హైదరాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హుడా– ప్రస్తుత హెచ్​ఎండీఏ), ఆ తర్వాత  కులీ కుతుబ్​షా(1981),  కాకతీయ (1982) ఏర్పాటయ్యాయి. రాష్ట్రం వచ్చాక  నిజామాబాద్​, శాతావాహన (కరీంనగర్​), సిద్దిపేట, స్తంభాద్రి (ఖమ్మం) పేర్లతో అథారిటీలు ఏర్పాటు చేశారు. మెదక్​లో ముడా, జనగామ, జగిత్యాలలో జుడా ఏర్పాటు ప్రపోజల్స్ సర్కారు వద్ద పెండింగ్​లో ఉన్నాయి. తాజాగా నల్గొండలో నుడా( నీలగిరి అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ) ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు. హెచ్​ఎండీఏ తప్ప మిగిలిన అథారిటీలన్నీ ఫండ్స్​ లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా మాస్టర్​ప్లాన్​ లక్ష్యాలు నెరవేరట్లేదు. దీంతో సర్కారు  కొన్నేండ్లుగా యూడీఏలను రియల్​ ఎస్టేట్​వైపు ప్రోత్సహిస్తున్నది. ఈ దిశగా హెచ్​ఎండీఏతో పాటు వరంగల్​లోని కుడా మాత్రమే కొంత సక్సెస్​ అయ్యాయి.