పుట్ట మధును గెలిపిస్తే మంథనిని కేసీఆర్ దత్తత తీసుకున్నట్లే : కల్వకుంట్ల కవిత

పుట్ట మధును గెలిపిస్తే మంథనిని కేసీఆర్ దత్తత తీసుకున్నట్లే : కల్వకుంట్ల కవిత

కాటారం, వెలుగు : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంథని బీఆర్ఎస్​ అభ్యర్థి పుట్ట మధుని గెలిపిస్తే సీఎం కేసీఆర్​ మంథని నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు.

మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులని అణగదొక్కారని, ఉద్యమంలో భాగంగా తాను కాటారంకు వస్తే  ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మధుని గెలిపిస్తేనే మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్​నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు, జయశంకర్​ భూపాలపల్లి జడ్పీ చైర్మన్​ జక్కు శ్రీహర్షిణి  తదితరులు పాల్గొన్నారు