ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
పినపాక, వెలుగు: తరతరాలుగా పోడు సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, బీమా పథకాలు అందకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుపడుతున్నారని ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్రేగా కాంతారావు ఆరోపించారు. సాగులో ఉన్న భూముల జోలికి వస్తే ఫారెస్ట్ఆఫీసర్లను తరిమికొట్టాలని పోడు రైతులకు సూచించారు. శనివారం ఆయన పినపాక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పోడు సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముచ్చటించారు. తోగ్గూడెం గ్రామంలో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. దుగినేపల్లి పరిధిలోని సర్వే నం.30, పోట్టపల్లిలోని సర్వే నం.560, పినపాక పరిధిలోని సర్వే నం.512లో ఉన్న వేలాది ఎకరాలు గవర్నమెంట్ల్యాండ్స్అని రికార్డులు తేటతెల్లం చేస్తున్నప్పటికీ ఫారెస్ట్ఆఫీసర్లు అత్యుత్సాహంతో ట్రెంచ్లు కొడుతూ నిరుపేద రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్టేట్గవర్నమెంట్నుంచి శాలరీ తీసుకుంటూ సెంట్రల్గవర్నమెంట్రూల్స్పాటిస్తామని చెప్పడం దారుణమన్నారు. సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, సర్పంచి శ్రీలత, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య తదితరలు పాల్గొన్నారు.