న్యూఢిల్లీ: ఆధార్– పాన్ కార్డు లింకింగ్కు చివరి తేదీ ఈ నెల 30న ముగుస్తుంది. అంతకుముందు ఈ గడువు 31 మార్చి 2022 వరకు ఉండేది. రూ.500 చివరి జరిమానాతో 30 జూన్ 2022 వరకు పొడిగించారు. జూన్లోపు పాన్ కార్డ్ హోల్డర్ తన కార్డ్ను ఆధార్ నంబర్ను లింక్ చేయించుకోకుంటే లింకింగ్ చేయించుకోవడానికి రూ. వెయ్యి లేటు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234హెచ్ (మార్చి 2021లో ఫైనాన్స్ బిల్లు ద్వారా చేర్చారు) ప్రకారం మార్చి 31లోగా పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే రూ.1,000 వరకు జరిమానా వేస్తారు. ఇలాంటి పాన్ కార్డ్లు మరో ఏడాది పాటు పనిచేస్తాయి. 2023 మార్చి లేదా 2023 ఫైనాన్షియల్ ఇయర్ వరకు, ఐటీఆర్ ఫైల్ చేయడం, రీఫండ్లు ఇతర ఐటీ క్లెయిమ్ల కోసం వీటిని వాడుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) సర్క్యులర్ ప్రకారం, మార్చి 31, 2022 తర్వాత కానీ 30 జూన్ 2022లోపు కానీ తమ పాన్ను 12-అంకెల యూనిక్ యూఐడీఏఐ నంబర్తో లింక్ చేస్తే రూ.500 లేట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జూన్ చివరి నాటికి తమ పాన్ను ఆధార్ నంబర్తో సీడ్ చేయని వారు తమ పాన్ను ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవడానికి రూ.1,000 జరిమానా చెల్లించాలి. లేట్ ఫీజు చెల్లించిన తర్వాత పాన్– ఆధార్ను లింక్ చేయవచ్చు.
లేట్ ఫీజును ఎలా చెల్లించాలి ?
మేజర్ హెడ్ 0021 & మైనర్ హెడ్ 500 (ఫీజు)తో చలాన్ నంబర్ ఐటీఎన్ఎస్ 280 ద్వారా లేటు ఫీజు చెల్లించాలి. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు కొనడం, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైనవాటికి తప్పనిసరిగా పాన్ కార్డ్ కావాలి. లేకుంటే ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టలేరు కాబట్టి ఇది యాక్టివ్గా ఉండటం తప్పనిసరి. ఎవరైనా చెల్లని పాన్ కార్డ్ను అందజేస్తే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272బీ ప్రకారం, అసెసింగ్ అధికారి సంబంధిత వ్యక్తికి రూ.పదివేల జరిమానా విధించవచ్చు.
పాన్ను ఆధార్తో ఎలా లింక్ చేయాలి