ఈ ఎగ్‌ రోల్‌ తింటే రూ.20 వేలు ప్రైజ్ మనీ

ఈ ఎగ్‌ రోల్‌ తింటే రూ.20 వేలు ప్రైజ్ మనీ

న్యూఢిల్లీ: ఫుడ్ కాంపిటీషన్ల గురించి వినే ఉంటారు. నిర్ణీత సమయంలో ఇంత ఫుడ్ తినాలంటూ పెట్టే ఈ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఫుడ్ లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి ఓ ఫుడ్ కాంపిటీషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 30 గుడ్లతో తయారు చేసిన కాతీ అనే 10 కిలోల రోల్‌ను 20 నిమిషాల్లో తినాలి. దేశ రాజధానిలోని మోడల్ టౌన్‌లోని ఓ ఫుడ్ స్టాల్ ఈ పోటీని పెట్టింది. నిర్ణీత సమయంలో కాతీ రోల్‌ తిన్నవారికి ఏకంగా రూ.20 వేల ప్రైజ్ మనీని ఇస్తామని ఆ ఫుడ్ స్టాల్ ఆఫర్ ప్రకటించింది. గుడ్లతో తయారు చేస్తున్న ఈ భారీ కాతీ రోల్‌ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చాలెంజ్‌‌లో గెలవాలంటే రెండ్రోజులు ఉపవాసం ఉండి ప్రయత్నించాలని కొందరు నెటిజన్లు స్పందిస్తుండగా.. ఇంకొందరు దీన్ని తినే ముందు మెడిసిన్స్ రెడీగా ఉంచుకోవాలని సెటైరికల్‌గా మెసేజులు పెడుతున్నారు. 
 

మరిన్ని వార్తల కోసం: 

నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు

చెబితే వింటది..చెప్పింది చేస్తది

వృద్ధురాలిపై చిరుత దాడి.. మూడ్రోజుల్లో రెండో ఘటన