- అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో పట్టుకున్న పోలీసులు
- ఐఎస్లో చేరుతానంటూ ఈమధ్యే సోషల్ మీడియాలో పోస్ట్
న్యూఢిల్లీ: ఐఎస్లో చేరాలనుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గౌహతి ఐఐటీ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అస్సాంలోని కమ్రూప్ జిల్లా హజో ప్రాంతంలో అతడిని పట్టుకున్నారు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన యువకుడు ఐఐటీ గౌహతీలో బయోటెక్నాలజీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. తనకు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్లో చేరాలనుందంటూ ఈ మధ్యే లింక్డ్ఇన్తో పాటు ఈమెయిల్స్ ద్వారా తెలియజేశాడు.
ఆపై క్యాంపస్ నుంచి మాయమయ్యాడు. పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేసి అతడికోసం గాలించారు. అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో జర్నీలో ఉండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 10 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ మెయిల్ ద్వారా అతడు తెలియజేసిన సమాచారం నిజమే అని గౌహతి క్యాంపస్కు వెళ్లి నిర్ధారించాకే లుక్అవుట్ నోటీసులిచ్చామని అస్సాం డీజీపీ పేర్కొన్నారు. అతడి హాస్టల్ రూమ్లో నుంచి ఐఎస్ జెండాను పోలిన బ్లాక్ జెండా, ఇస్లామిక్ స్క్రిప్ట్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.