
- కామారెడ్డి జిల్లాలో ఆగని వసూళ్లు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ చెక్ పోస్టుల్లో జోరుగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. ఏసీబీ దాడులు జరుతున్నా వసూళ్ల పర్వం కొనసాగుతూనేఉంది. దాడులు జరిగిన ప్రతిసారి ఆయా చెక్ పోస్టుల్లో లెక్కల్లో కనిపించని నగదు పట్టుబడుతోంది. జిల్లాలో ఆర్టీఏకు సంబంధించిన రెండు చెక్ పోస్టులున్నాయి. హైదారాబాద్ నుంచి నాగ్పూర్కు వెళ్లే హైవేపై భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర, సంగారెడ్డి,-నాందేడ్,-అకోల హైవే మీద మద్నూర్ మండలం సలవత్పూర్ దగ్గర ఈ చెక్ పోస్టులున్నాయి.
ఈ మార్గాల్లో ప్రయాణించే వెహికల్స్కు సంబంధించి పర్మిట్లు, కెపాసిటీ లోడ్ వంటి పత్రాలను తనిఖీ చేయాలి. పత్రాలు సరిగ్గా లేకున్నా, పర్మిట్లు లేకున్నా, కెపాసిటీకి మించి లోడ్ తీసుకెళ్తున్నా ఆర్టీఏ అధికారులు ఫైన్వేస్తారు. తీవ్రమైన ఉల్లంఘనలుంటే వెహికల్స్ సీజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉండే అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతుంటారన్న ఆరోపణులున్నాయి.
పత్రాల వెరిఫికేషన్ తూతూమంత్రంగా జరుపుతూ లారీలు, డీసీఎంలు, ట్రక్కుల డ్రైవర్ల నుంచి ఒక్కో వెహికల్కు రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్ఉతన్నారు. జంగంపల్లి , సలాబత్పూర్ చెక్ పోస్టుల్లో ప్రతి రోజు వేలల్లో అక్రమవసూళ్లు జరుగుతుంటాయి. కొందరు అధికారులు చెక్ పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని షిప్టుల ప్రకారం వారికి డ్యూటీలు వేస్తూ వసూళ్లు చేయిస్తున్నారు.
ఏబీసీ దాడులు చేస్తున్నా అగని అక్రమాలు
రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా వసూళ్ల దందా అగడంలేదు. ఈ ఏడాది జూలై 17న ఏసీబీ రాష్ట్రవ్యాప్తంగా జరుగిన మెరుపు దాడుల్లో భాగంగా జంగంపల్లి, సలాబత్పూర్ చెక్ పోస్టుల్లోనూ తనిఖీలు చేశారు. భారీగా నగదు సీజ్ చేశారు. శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామువరకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రికార్డుల్లో లేని నగదు పట్టుబడింది. జంగంపల్లి వద్ద ఏఎంవీఐ మహమ్మద్ అఫ్రోజుద్దీన్ డ్యూటీలో ఉన్నారు.
అతని వెహికిల్లో లెక్కల్లో చూపని రూ. 5వేల అమౌంట్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైవేపై వెళ్తున్న వెహికల్స్ నుంచి ప్రైవేట్ వ్యక్తులు అమౌంట్ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద రూ. 45,100 స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ మొత్తం రూ.50,100 సీజ్ చేశారు. మద్నూర్ మండలం సలావత్పూర్ వద్ద ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ అనధికారికంగా రూ.10వేల అమౌంట్ గుర్తించారు. ఇక్కడ డ్రైవర్లు నేరుగా డబ్బులు వేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ బాక్స్లో రూ.26వేలు ఉన్నాయి. అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు కూడా పలువురు లారీల డ్రైవర్లు ఈ డబ్బాలో అమౌంట్ వేసి వెళ్ళారు. ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.