ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. పలువురికి గాయాలు

 ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. పలువురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇమ్రాన్ గాయపడ్డారు. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

పాకిస్థాన్‭లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న కంటైనర్ -మౌంటెడ్ -ట్రక్కుపై కాల్పులు జరిగాయి. అయితే.. ముందస్తు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ కు నిరసన ప్రదర్శనగా వెళ్తున్నారు. ఆ సమయంలో గుజ్రాన్ వాలాలోని అల్లావాలా చౌక్ వద్దకు రాగానే కాల్పుల మోత మోగింది. దీంతో ర్యాలీలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ కాల్పులో పలువురికి గాయాలు అయ్యాయి. కాగా.. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.