బషీర్బాగ్, వెలుగు: ‘అన్నా అన్నా.. మర్జాతే అన్నా.. జగే నహే అన్నా.. దర్వాజ బంద్హే.. దోనో బచ్చే బీ హే.. హమ్ తీనో మర్జాతే.. కుచ్బీ నహీ కర్సక్తా.. కుచ్బీ నహీ దిక్రా..’ అంటూ గత శనివారం నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాదంలో మరణించిన ఇంతియాజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అత్తాపూర్ సుభాన్పురాకు చెందిన ఇంతియాజ్ఫర్నిచర్ షాపులో పని చేసేవాడు. ఆ రోజు షాపులోనే ఉన్న ఇంతియాజ్అగ్ని ప్రమాదం జరగడంతో పిల్లలున్న రూమ్ వైపు పరుగులు తీశాడు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించాడు. ఈ లోపే సెల్లార్ను పూర్తిగా మంటలు, దట్టమైన పొగ ఆక్రమించాయి. బయటపడలేని పరిస్థితుల్లో తనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, రక్షించాలంటూ షాపులో పని చేసే మరో వ్యక్తితో ఫోన్చేసి చివరిసారిగా మాట్లాడాడు. ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ కాల్రికార్డింగ్ విన్నవారందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
- ఇంతియాజ్ : హలో అన్న అన్న చచ్చిపోయేలా ఉన్నాము. నాతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు
- మరో వ్యక్తి : ఇంతియాజ్ భయపడకు, వెనుక గ్రిల్ డోర్ నుంచి బయటకు రా..
- ఇంతియాజ్ : లేదన్నా.. సెల్లార్ వెనుక నుంచి వచ్చే డోర్ కూడా ఓపెన్ కావట్లేదు. పక్కనే ఉన్న రూమ్ డోర్ కూడా లాక్ చేసి ఉంది.
- మరోవ్యక్తి : కింద ఉన్న రెండో సెల్లార్కు వెళ్లిపో ఇంతియాజ్
- ఇంతియాజ్ : అన్న.. ఇక్కడ మొత్తం పొగే ఉంది..ఏం కనిపిస్తలేదు. ఊపిరి ఆడుతలేదు. నాతోని ఉన్న ఇద్దరు పిల్లలు స్పృహ కోల్పోతున్నరు.. ఏదో ఒకటి చెయ్ అన్నా..
- మరో వ్యక్తి : మొబైల్ టార్చ్ వేసుకొని రెండో సెల్లార్కు వెళ్లు ఇంతియాజ్..
- ఇంతియాజ్ : నాకు ఏం కనిపిస్తలేదన్నా.. చుట్టూ మొత్తం చీకటే.. మంటలు తప్ప ఏం కనిపిస్తలేవు..ఊపిరి ఆడుతలేదు( దగ్గు..ఆయాసంతో)
- మరోవ్యక్తి : సమీర్ రూమ్ డోర్ ఓపెన్ చేయి.. దాని నుంచి వెనుక మార్గంలో బయటకు రా..
- ఇంతియాజ్ : సమీర్ రూమ్ కూడా లాక్ చేసి ఉందన్నా.. ఇక ఏం చేయలేమన్నా.. -ఊపిరి ఆడక మాట్లాడనీకి కూడ వస్తలేదు. ఇక బయటపడే వచ్చే పరిస్థితి లేదన్నా.. చచ్చిపోతాం అనిపిస్తుందన్నా..అంటూ ఇంతియాజ్ సృహ కోల్పోయాడు. రెస్క్యూ ఆపరేషన్తర్వాత ఇంతియాజ్తో పాటు ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు డెడ్బాడీలను
- గుర్తించారు.
