కోపంతో.. మొబైల్ మింగేసిన బాలిక.. తప్పిన ప్రమాదం 

కోపంతో.. మొబైల్ మింగేసిన బాలిక.. తప్పిన ప్రమాదం 

ఇంట్లో పిల్లలు అలగడం, కోప్పడటం కామన్. ఆ టైంలో వాళ్లు ఏదేదో చేస్తుంటారు. కొందరు ఏడిస్తే.. మరికొందరు చేతికి ఏది దొరికితే అది పడలగొట్టేస్తారు. ఇంటి తరహా ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. సోదరుడితో గొడవ పడిన ఓ అమ్మాయి.. కోపంలో మొబైల్ ఫోన్ మింగేసింది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. తన ఓ బాలిక తన సోదరుడితో ఫోన్ విషయంలో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దాంతో పట్టరాని కోపం వచ్చిన ఆ అమ్మాయి.. మొబైల్ ను మింగేసింది. 

కొంతసేపటి తర్వాత.. వాంతులు, విపరీతమైన కడునొప్పితో బాద పడింది ఆ అమ్మాయి. బాలుడ్ని మందలించడం ద్వారా విషయం తెలసుకున్న తల్లిదండ్రులు.. గ్వాలియర్ హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్ చేయించారు. తన కడుపులోనుంచి మొబైల్ ఫోన్ తొలగించారు. దీంతో ఆ అమ్మాయికి పెను ప్రమాదం తప్పింది.