హైదరాబాద్, వెలుగు : దసరా పండుగను పురస్కరించుకొని మొబైల్స్ రిటైల్ చెయిన్ లాట్ మొబైల్స్ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి కొనుగోలుపై కచ్చితంగా ఒక బహుమతి ఇస్తామని, రూ.10 వేల వరకు క్యాష్బ్యాక్ను కూడా పొందవచ్చని సంస్థ డైరెక్టర్ అఖిల్ ప్రకటించారు. కొన్ని మొబైల్స్తో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను జీరో డౌన్పేమెంట్తో కొనొచ్చు. రూ.వెయ్యికే స్మార్ట్వాచ్ను అమ్ముతున్నారు.
టీవీ కొంటే సౌండ్బార్, వూఫర్ ఆఫర్ ఉంది. బ్రాండెడ్ యాక్సెసరీలు, ఇతర వస్తువులపై 60 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంది. వివో వీ29 పై ప్రత్యేక ఆఫర్ ఉంది. బ్రాండెడ్ స్మార్ట్ టీవీల ధరలు రూ.తొమ్మిది వేల నుంచి, లాప్టాప్ల ధరలు రూ.16,500 నుంచి మొదలవుతాయి. ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై క్యాష్బ్యాక్లు ఉన్నాయి. స్మార్ట్ ప్రొటెక్షన్ ప్లాన్లు, ఎక్స్ట్రా వారంటీ ఆఫర్లూ ఉన్నాయి. పేటీఎం, మొబీక్విక్ వాలెట్ల ద్వారా డబ్బు చెల్లిస్తే ఐదు శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ పొందవచ్చని అఖిల్ తెలిపారు.