వాషింగ్టన్: ట్విటర్ను కొనాలన్న ఆలోచ నను చివర్లో విరమించుకొని కేసులో ఇరుక్కున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఆ సంస్థపై అమెరికా కోర్టులో కంప్లయింట్ చేశారు. ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన "ప్రమాదకర" వ్యాజ్యం గురించి తమకు చెప్పలేదని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా మూడో అతి పెద్ద మార్కెట్ను ప్రమాదంలో పడేసిందని డెలావేర్ కోర్టుకు అందించిన కౌంటర్లో పేర్కొన్నారు. ట్విట్టర్ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం చేయడా నికి మోసపూరితంగా తనను ఒప్పించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించా రు.
అనుచిత సోషల్ మీడియా పోస్ట్ల పై విచారణ జరపడానికి, సంబంధిత సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించి న కంపెనీలను ప్రాసిక్యూట్ చేయడానికి భారతదేశ సమాచార, సాంకేతిక శాఖ పోయిన ఏడు ఆదేశాలు జారీ చేసింది. వీటిని ట్విట్టర్ వ్యతిరేకించింది. దీనిపై ట్విట్టర్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు తొల గించాలని ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని విమర్శించింది. స్పామ్ ఖాతాల గురించి పూర్తివివరాలు ఇవ్వలే దంటూ మస్క్ ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకున్నారు. దీనిని సవాల్ చేస్తూ ట్విట్టర్ మస్క్పై కేసువేసింది.