
హైదరాబాద్, వెలుగు: ఉప ఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ హుజూర్ నగర్లో నిర్వహిస్తున్న సభను మాదిగలతో కలిసి అడ్డుకుంటామని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క వెలమ సామాజికవర్గమే బాగుపడిందని, మాదిగలను రాజకీయంగా అణిచేస్తోన్న కేసీఆర్ గద్దెదిగే దాకా దండోరా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సతీశ్ పేర్కొన్నారు.