
- 2005కు పూర్వం ఒక సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ ఏదీ భారత్ అభివృద్ధి చేయలేదు.
- 1994లో జపాన్లోని యొకొహోమా నగరంలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో తొలిసారిగా విపత్తు సంసిద్ధతపై చర్చించారు.
- అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో విపత్తు నిర్వహణ చాలా పేలవంగా ఉందని గుర్తించారు. కాబట్టి ప్రతి సభ్య దేశం తమ పౌరుల రక్షణ, విపత్తు నిర్వహణ, నిర్మూలన సంసిద్ధత చర్యలను నిర్వహించి, విపత్తు ద్వారా సంభవించే నష్టాన్ని తగ్గించాలని ఈ సదస్సులో నిర్ణయించారు.
- అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సహకరించుకోవాలని సూచించారు. ఇదే సదస్సులో 1990–2000 దశకాన్ని ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ నేచురల్ డిజాస్టర్ రిడక్షన్గా గుర్తించారు.
- యొకొహోమ సదస్సు స్ఫూర్తితో భారత ప్రభుత్వం 1999లో జాతీయ విపత్తు నిర్వహణకు ఒక హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేసింది.
- 2001 జనవరిలో గుజరాత్ భూకంపం తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ఏర్పాటుకు, నిర్మూలన చర్యలను సూచించడానికి ఒక జాతీయ కమిటీ ఏర్పాటు చేశారు.
- 10వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా విపత్తు నిర్వహణ అంశాన్ని చేర్చారు.
- 2005, డిసెంబర్ 23న ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది.
- ఈ చట్టంలో భాగంగా దేశంలో విపత్తు నిర్వహణకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు ప్రణాళికలు, విధానాలను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేసే లక్ష్యంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) ఏర్పాటైంది. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నత యంత్రాంగం ఎన్డీఎంఏ విధులను నిర్వహిస్తుంది.
- రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కృషి చేస్తుంది.
- జిల్లా స్థాయి విపత్తు నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని డీడీఎంఏ ప్రణాళికలు అమలు చేస్తుంది.
- విపత్తు నిర్వహణపై పూర్తిస్థాయిలో పరిశోధనలు నిర్వహించడంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు అందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీలో ఏర్పాటైంది.
- యొకొహోమ సదస్సు అనంతరం 1995లో నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేశారు. 2003 అక్టోబర్ 16న దీనిని ఎన్ఐడీఎంగా అభివృద్ధి చేశారు.
- విపత్తు సంభవించిన సమయంలో తక్షణ సహాయ కార్యక్రమాలను అందించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని వేగవంతంగా రక్షించే ఉద్దేశంతో జాతీయ విపత్తులో భాగంగా 2006లో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటైంది. 2006లో ఎనిమిది బెటాలియన్లతో ఇది ఏర్పాటైంది. ఇందులో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీకి చెందిన రెండు బెటాలియన్లు ఉన్నాయి.
- ప్రస్తుతం 15 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు ఉన్నాయి. పై నాలుగు ప్యారా మిలిటరీ దళాలకు అదనంగా సశస్త్ర సీమబల్ అండ్ అసోం రైఫిల్స్కు చెందిన బెటాలియన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఒక్కో బెటాలియన్లో 1149 మంది సిబ్బంది ఉంటారు.
- ఎన్డీఆర్ఎఫ్లో స్త్రీలను చేర్చుకునే లక్ష్యంతో 100 మంది స్త్రీ దళాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది.
- వీరు ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
- 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2015 నేపాల్ భూకంపం, 2022 అసోం వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ కీలక బాధ్యతలు నిర్వర్తించింది.