లక్షా 36 వేలకు తులం బంగారం లడ్డూ దక్కించుకున్న మహిళ

లక్షా 36 వేలకు తులం బంగారం లడ్డూ దక్కించుకున్న మహిళ

హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఓ మండపంలోని వినాయకుడి లడ్డూ (బంగారు లడ్డూ) వేలం పాటలో లక్షా 36 వేలకు అమ్ముడుపోయింది. నారాయణగూడ స్ట్రీట్ నెంబర్ 5లో నెలకొల్పిన గణనాథుడు చేతులో ప్రత్యేకంగా తులం బంగారంతో తయారు చేసిన లడ్డూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు తులం బంగారంతో లడ్డూను తయారు చేసి, గణనాథుడి చేతిలో ప్రతిష్టించారు. గత 24 ఏళ్లుగా గణేష్ విగ్రహాన్ని పెడుతున్నట్లు నిర్వాహకులు అనిష్ గంగపుత్ర తెలిపారు. 

నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డూతో పాటు తులం బంగారంతో తయారు చేసిన లడ్డూను వేలం వేశారు. ఒక వెయ్యి116 రూపాయల ధరతో వేలం పాట మొదలు కాగా ఒక లక్షా 36 వేలకు హిమాయత్ నగర్ కు చెందిన సంధ్యారాణి అనే మహిళ దక్కించుకుంది. స్వామి వారి లడ్డూను దక్కించుకున్న మహిళను వినాయక విగ్రహం నుంచి వారి ఇంటి వరకు డప్పు వాయిద్యాలతో ఊరిగింపు చేశారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తూ.. డీజే పాటలు, తీన్మార్ చప్పుల మధ్య మహిళలు నృత్యాలతో సందడి చేశారు.