ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ఐదో ఓటమి

 ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ఐదో ఓటమి

పుణె :  ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ చెత్తాట కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ టైటాన్స్ ఖాతా తెరవలేకపోయింది. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ 51–40తో టైటాన్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. 

దబాంగ్ టీమ్‌‌‌‌‌‌‌‌లో అషు మాలిక్ (16 పాయింట్లు), కెప్టెన్ నవీన్ కుమార్  (14 పాయింట్లు) సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌10తో రెచ్చిపోయారు. తెలుగు జట్టులో కెప్టెన్ పవన్ సెహ్రావత్ (14) మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పుణెరి పల్టన్ 49–19తో బెంగాల్‌‌‌‌‌‌‌‌ వారియర్స్‌‌పై ఘన విజయం సాధించింది.