
- అన్ని డిపార్ట్మెంట్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
- 2014–15 నుంచి 2022–-23 వరకు ప్రగతి రిపోర్ట్
- 26 డిపార్ట్మెంట్లలో మొదలైన హడావుడి
- వచ్చే నెలలో నల్గొండలో కేటీఆర్పర్యటన
- ఎన్నికలకు ముందే సన్నద్ధం చేస్తున్న అధికారులు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ప్రజల మెప్పుపొందేందుకు బీఆర్ఎస్ పకడ్బందీ కార్యచరణ రూపొందిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సిరిసిల్ల తరహాలో నల్గొండ అభివృద్ధికి నివేదికలు రూపొందించాలని జిల్లా అధికారయం త్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాకు బీఆర్ఎస్ అగ్రనేతల రాక ఊపందుకుంది. నాలుగు రోజుల కింద చౌటుప్పుల్లో ఆరోగ్య మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వచ్చేనెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్నల్గొండ పట్టణంలో పర్యటించనున్నారు. ఇక నుంచి ప్రతి నియోజ కవర్గంలో జరిగే ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ ముఖ్యులను రప్పించేందుకు ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ఐదారు నెలల గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం, పార్టీ తరపున జరిగే ఏ కార్యక్రమంలో అయినా తాము చేసిన గొప్ప పనుల గురించి ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారు.
ప్లానింగ్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు..
మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల తరహాలో అభివృద్ధి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి జిల్లా ప్లానింగ్డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు. 2018లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకుల సందర్భంగా ‘రైతు సంక్షేమ ప్రభుత్వం వర్ధిలాల్లి.. సిరిసిల్ల నియోజకవర్గం ప్రగతి నివేదిక’ అనే పేరుతో ఎజెండా రూపొందించారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల ప్రగతి నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ముందు అయితే వచ్చే నెల మొదటి వారంలో నల్గొండలో కేటీఆర్ పర్యటన ఉన్నందున నియోజకవర్గానికి సంబంధించి ప్రగతి నివేధిక యుద్ధప్రాతిపధికన తయారు చేసి ఈ నెల 24లోగా అంద జేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
9 ఏళ్లలో సాధించిన ప్రగతి పైనే ఫోకస్...
2014-–15 నుంచి 2022–-23 వరకు తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి స్పష్టంగా కనిపించేలా నివేధిక లు ఉండాలన్నారు. మొత్తం 26 డిపార్ట్మెంట్లలో తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టిన ఫండ్స్, లబ్ధిదారుల వి వరాలను గణాంకాలతో సహా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల వారీగా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్కిట్లు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్, ఆసరా ఫించన్లు, ఉపాధి హామీ పథకం రోడ్లు, పంచాయతీరాజ్, ఆర్ ఆండ్ బీ రోడ్లు, మిషన్ భగీరథ, ఆరోగ్యం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఎంపీ ల్యాండ్స్, గొర్రెల స్కీం, తాగు, సాగు నీటి ప్రాజెక్టుల సంబంధించిన అన్ని వివరాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఎన్నికల స్ట్రాజీలో భాగంగానే...
ఎన్నికల స్ట్రాజీలో భాగంగానే అధికారులు ప్రగతి నివేధికల పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవ ల మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ఓట్లుగా మలిచిన వ్యూహాం వర్కవుట్ అయిందని అధిష్టానం నమ్ముతోంది. గ్రామాలవారీగా లబ్ధిదారుల వివరాలు సేకరించడంతో పాటు, ఇంటింటికీ లెటర్లు, మెసేజ్ల ద్వారా కేసీఆర్ సందే శం పంపారు. ఇదే స్ట్రాజీని వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఉమ్మ డి జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించే చాన్స్ ఉందని అధికారులు చెపుతున్నారు. అందుకే గ్రామాల వారీగా ప్రగతి నివేదికలు తయారు చేస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.