
హైదరాబాద్, వెలుగు: భారతదేశంలోని ఐదవ- అతిపెద్ద సిమెంట్ గ్రూప్ అయిన నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్లో సరికొత్త రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ను ప్రారంభించింది. కొత్త ప్లాంట్ ఈ ప్రాంతంలో 5వదని సంస్థ తెలిపింది. ఎన్నో సౌకర్యాలతో మేడ్చల్లో దీనిని ఏర్పాటు చేశారు. నిర్మాణ సామగ్రి కోసం ఈ ప్రాంతంలో డిమాండ్ను తీర్చడానికి నువోకో తన సామర్థ్యాన్ని విస్తరించింది. నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు కూడా ఇది తన ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది. ఈ ప్లాంటు వీఏపీ సహా అన్ని గ్రేడ్ల కాంక్రీటును ఉత్పత్తి చేస్తుందని నువోకో తెలిపింది.