ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్​సైట్​ ఆవిష్కరణ

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్​సైట్​ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్​సైట్​ను ఆయన మంగళవారం ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం గతంలో తాను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

దేశంలో తొలిసారి ఇలాంటి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ తీసుకురావడం పట్ల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశంను వివేక్‌‌‌‌‌‌‌‌ ప్రశంసించారు. షెడ్యూల్ కులాల్లో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల చరిత్ర, సంస్కృతులు, వారి జీవన విధానాన్ని వెబ్​సైట్ ద్వారా సమాజానికి పరిచయం చేసే గొప్ప ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏర్పుల భాస్కర్ బైండ్ల, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిముల్ల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ హోలేయదసరి, రాయిల లక్ష్మీనర్సయ్య చిందు, ఏదుల్ల గౌరీ శంకర్ బైండ్ల, పవన్, నాయకులు గడ్డం సమ్మయ్య, ముప్పాళ్ల సుధాకర్, గడ్డం సుదర్శన్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.