- మునపటిలా కనిపించని గిరాకీ
- డీలా పడుతున్న వ్యాపారులు
- మొబైల్ మార్కెట్లపై జీఎస్టీ ఎఫెక్ట్
లాక్డౌన్ సడలింపులతో కొత్త మొబైల్స్ కొందామనుకున్న వాళ్లూ, రిపేర్ చేయించుకునేందుకు వెళ్తున్న వాళ్లకు పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రావడంతో సెల్ ఫోన్లు, స్పేర్ పార్ట్స్ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ12 నుంచి 18 శాతానికి పెరగడంతో కంపెనీలూ ధరలు పెంచేశాయి. నార్మల్ డేస్లో కిటకిటలాడే జగదీశ్మార్కెట్, గుజరాతీ గల్లీల్లో కస్టమర్లు పెద్దగా కనపడడం లేదు. సరి-–బేసి సిస్టమ్లో షాపులు తెరుస్తున్నా , రేట్లు పెరగడంతో ఇంట్రెస్ట్ చూపడం లేదని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్మొత్తం డీలా పడిందంటున్నారు.
స్పేర్ పార్ట్స్ షార్టేజ్
కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్కు ముందే చైనా నుంచి మొబైల్ స్పేర్ పార్ట్స్ సప్లయ్ ఆగిపోయింది. ఎక్కువ డిమాండ్ ఉన్నవి మార్కెట్లో దొరకడం లేదు. ఇంకా టైం పడుతుందని షాప్ ఓనర్లు చెప్తున్నారు. జీఎస్టీ ప్రభావం, షార్టేజ్ కారణంగా 3 నెలల క్రితం ఉన్న రేట్లతో పోలిస్తే ఇప్పుడు 25 నుంచి 40 శాతం పెరిగాయి.