పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే..

పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే..

దేశంలో ఆదివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 54,650కి చేరింది. శనివారం ఈ ధర రూ. 54,550గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 280 తగ్గి.. రూ. 59,620కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 59,510గా ఉంది.  హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,620గా ఉంది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,920గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 59,770గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,150గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,790గాను ఉంది.
అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,820గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,770గా ఉంది. 

500 తగ్గిన వెండి ధర ..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ.7,400గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 500 తగ్గి.. రూ. 73,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 73,600గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​73,100.. బెంగళూరులో రూ. 72,350గా ఉంది. 

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.