హైదరాబాద్, వెలుగు: గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ఎక్కువగా ఉన్న దేశాలలో మనం రెండో ప్లేస్లో నిలిచాం. 2021లో ఇండియాలో మొత్తం 611 టన్నుల గోల్డ్ జ్యుయెలరీని కొన్నారు. 673 టన్నుల గోల్డ్ జ్యుయెలరీ కొనుగోళ్లతో చైనా మనకంటే ముందుందని ఒక రిపోర్టు వెల్లడించింది. జ్యుయెలరీ డిమాండ్ అండ్ ట్రేడ్ పేరిట వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురువారం నాడు ఒక రిపోర్టును రిలీజ్ చేసింది. అంతేకాదు, మన దేశం నుంచి బంగారం ఆభరణాల ఎగుమతులు కూడా గత కొన్నేళ్లలో భారీగా పెరిగాయి.
ఎగుమతుల జోరు...
2015 లో మన దేశపు ఆభరణాల ఎగుమతులు 7.6 బిలియన్ డాలర్లుండగా, 2019 నాటికి ఇవి 12.4 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. మన దేశంలో బంగారపు ఆభరణాలను ఎక్కువగా పెళ్లిళ్ల కోసమే కొనుగోలు చేస్తున్నట్లు డబ్ల్యూజీసీ ఈ రిపోర్టులో పేర్కొంది. మొత్తం గోల్డ్ జ్యుయెలరీ అమ్మకాలలో పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే వారు 50 నుంచి 55 శాతం దాకా ఉంటున్నట్లు వివరించింది. ఇండియాలో అమ్ముడవుతున్న గోల్డ్ జ్యుయెలరీ లో 80–85 శాతం వాటా ప్లెయిన్ జ్యుయెలరీదే. వీటిని 22 క్యారెట్ల గోల్డ్తో తయారు చేస్తారు. ఇటీవల కాలంలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యుయెలరీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. మొత్తం గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్లో రోజూ పెట్టుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాల వాటా 40 నుంచి 45 శాతం దాకా ఉంటుందని రిపోర్టు పేర్కొంది.
రూరల్ డిమాండే ఎక్కువ....
ఇండియాలో బంగారపు ఆభరణాల కొనుగోళ్లు రూరల్ ఏరియాలోనే ఎక్కువని కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు చెబుతోంది. మొత్తం గోల్డ్ జ్యుయెలరీ కొనుగోళ్లలో పల్లెల్లోని ప్రజల కొనుగోళ్లు 55–58 శాతమని పేర్కొంటోంది. గోల్డ్ జ్యుయెలరీని మన దేశంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నది మిడిల్ క్లాసేనని కూడా ఈ రిపోర్టు తెలిపింది. బంగారపు ఆభరణాల కొనుగోలులో దేశంలో దక్షిణాది రాష్ట్రాలే ముందుంటున్నట్లు పేర్కొంది. దేశంలోని బంగారపు ఆభరణాల డిమాండ్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతమని వివరించింది. 2021 లో ఇండియా జెమ్ అండ్ జ్యుయెలరీ ఎగుమతులలో గోల్డ్ జ్యుయెలరీ వాటా 23 శాతానికి చేరినట్లు పేర్కొంది.
యూత్ మెచ్చట్లే.....
గత కొన్నేళ్లలో ఇండియాలోని గోల్డ్ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయని ఈ రిపోర్టు ప్రస్తావించింది. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి నియంత్రణలు మారితే, మరోవైపు కన్జూమర్ బిహేవియర్లోనూ మార్పు వచ్చిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు పేర్కొంది. ఈ రెండు సవాళ్లను ఇండస్ట్రీ ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపింది. యువతరం బంగారపు ఆభరణాల కంటే ఇతర జ్యుయెలరీని ఇష్టపడటం వంటి కొత్త సవాళ్లు ఇప్పుడు ఎదురవుతున్నట్లు పేర్కొంది. డిఫరెంట్ స్టైల్ జ్యుయెలరీ లేదా లగ్జరీ ఫ్యాషన్ యాక్సెసరీస్ వైపు యువతరం మళ్లుతున్నట్లు వివరించింది. దేశం ఆర్థికంగా బలపడుతున్న క్రమంలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ కూడా జోరందుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. గోల్డ్ జ్యుయెలరీ తయారీ, ఎగుమతులు పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నట్లు కూడా డబ్ల్యూజీసీ రిపోర్టు తెలిపింది. రాబోయే ఏళ్లలో ఈ ఫోకస్ మరింత పెరుగుతుందని పేర్కొంది.
బంగారం ఆభరణాల వినియోగంలో రెండో ప్లేస్లో ఉన్న ఇండియా గ్లోబల్ మార్కెట్లో చాలా కీలకమైనది. పెళ్లిళ్లు, పండగలు ఇండియాలో గోల్డ్ జ్యుయెలరీ డిమాండ్ను పెంచుతున్నాయి. గోల్డ్ జ్యుయెలరీని ఇష్టపడటమనేది వందలాది ఏళ్లుగా దేశంలో కొనసాగుతోంది. గ్లోబల్ ట్రేడ్లో ఇండియా వాటా ఎక్కువవడానికి ఇది దోహదపడుతోంది.
- పీఆర్ సోమసుందరం , రీజినల్ సీఈఓ,
డబ్ల్యూజీసీ ఇండియా