ఇండియా వర్సెస్ పాక్..ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్..

ఇండియా వర్సెస్ పాక్..ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్..

చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్ లో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఆవేష్ ఖాన్ తుది జట్టులో ఆడనున్నాడు. 

భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,  దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్,  భువనేశ్వర్ కుమార్,  అవేశ్ ఖాన్. అర్ష్ దీప్ సింగ్.

పాకిస్థాన్ తుది జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, షానవాజ్ దహానీ,  షాదాబ్ ఖాన్.