IND vs ENG: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

IND vs ENG: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని

ఉప్పల్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత ఇన్నింగ్స్ మొదలవ్వగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. 

ఇన్నింగ్స్ విరామం కావడంతో భద్రతా సిబ్బంది కాస్త విశ్రాంతి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన ఓ అభిమాని ఉన్నట్టుండి మైదానంలోకి చొరబడ్డాడు. నేరుగా క్రీజులో నిల్చొని ఉన్న రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి.. అతని కాళ్లు మొక్కాడు. అంతలోనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అక్కడినుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నారు.