IND vs ENG: బజ్‌బాల్ రుచి చూపిస్తున్న జైస్వాల్.. ఉప్పల్‌లో అభిమానుల కేరింతలు

IND vs ENG: బజ్‌బాల్ రుచి చూపిస్తున్న జైస్వాల్.. ఉప్పల్‌లో అభిమానుల కేరింతలు

గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు బజ్‌బాల్‌ ఆటతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆ జట్టు ఆటగాళ్లు చూపించే దూకుడుకు ఆ పేరు పెట్టుకొని నానా హంగామా చేస్తున్నారు. ఇప్పుడు వారు కనిపెట్టిన బజ్‌బాల్ రుచి వారికే ఎదురవుతోంది. 

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(51 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు) ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తిస్తున్నాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ.. హైదరాబాద్ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ సైతం అదే దూకుడు కనపరుస్తున్నాడు. ఈ జోడి ఇంగ్లీష్ బౌలర్లపై ఏమాత్రం జాలి చూపడం లేదు. చివరి రోజు ఆటను తొలి రోజే చూపెడుతున్నారు. బంతి బౌండరీ వెళ్లిన ప్రతీసారి హైదరాబాద్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు.

అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్(70) ఒంటరి పోరాటం చేశాడు.