ఇంగ్లండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌.. రెడ్‌‌ బాల్‌‌ లయపై ఫోకస్‌‌: అర్ష్‌‌దీప్‌‌

ఇంగ్లండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌.. రెడ్‌‌ బాల్‌‌ లయపై ఫోకస్‌‌: అర్ష్‌‌దీప్‌‌

లండన్‌‌: ఇంగ్లండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌ నేపథ్యంలో.. వీలైనంత త్వరగా రెడ్‌‌ బాల్‌‌ లయను పట్టుకోవాలని పేసర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం గతంలో కౌంటీ మ్యాచ్‌‌లు ఆడిన కెంట్‌‌ గ్రౌండ్‌‌పై ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ నెల 13 నుంచి బెకెన్‌‌హామ్‌‌లోని కెంట్‌‌ కౌంటీ గ్రౌండ్‌‌లో ఇండియా–ఎ టూర్‌‌ మ్యాచ్‌‌ ఆడనుంది. ఇందులో అర్ష్‌‌దీప్‌‌ బరిలోకి దిగుతున్నాడు. ‘ఈ రోజు ట్రెయినింగ్‌‌ చాలా బాగుంది. శరీరం కొత్త అనుభూతికి లోనైంది. రెడ్‌‌ బాల్‌‌ చేతిలో నుంచి ఎలా వెళ్తుందో చక్కగా అర్థమైంది.

ఇది నాకు ప్రేరణ మాత్రమే. ఎందుకంటే ప్లేయర్లందరూ చాలా రోజులుగా వైట్‌‌ బాల్‌‌తోనే ఆడుతున్నారు. కాబట్టి నేను దీన్ని చాలా ఆస్వాదించా. ముందుకు సాగుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంది. బ్యాటర్లు రెడ్‌‌బాల్‌‌ను ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది’ అని అర్ష్‌‌దీప్‌‌ పేర్కొన్నాడు. రెడ్‌‌ బాల్‌‌తో తన సహచరులకు బౌలింగ్‌‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.

బ్యాటర్లు చాలా కాంపాక్ట్‌‌గా కనిపిస్తున్నారని, వాళ్లకు బౌలింగ్‌‌ చేయడం సరదాగా అనిపిస్తోందని తెలిపాడు.

మరిన్ని వార్తలు