ఇండియా vs పాక్ క్రేజ్.. పెళ్లిపీటల మీద నుండి నేరుగా స్టేడియానికి..

ఇండియా vs పాక్ క్రేజ్.. పెళ్లిపీటల మీద నుండి నేరుగా స్టేడియానికి..

ఆసియాకప్‌-2023లో దాయాదుల పోరు మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష్యంగా వీక్షించడానికి ఓ జంట(వధూవరులు) పెళ్లిపీటలు మీద నుండి నేరుగా స్టేడియానికి విచ్చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

హైవోల్టేజ్ మ్యాచ్ కావడంతో ఎన్నడూ లేనంతగా ప‌ల్లెకిలే స్టేడియం అభిమానులతో కిక్కిరిసి పోయింది. మూడు దేశాల క్రికెట్‌ అభిమానులు చాలా అతృతగా మ్యాచ్ చూస్తున్నారు. ఇప్పటివరకు ఆసియాకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. మరోసారి చిరకాల ప్రత్యర్థిపై అధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తోంది.

కాగా, మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(11), శుభ్ మాన్ గిల్(0) క్రీజులో ఉన్నారు.